మెక్సికోలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ: పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మృతి!
మెక్సికోలో విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో, ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ
మెక్సికోలో విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో, ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయారు. దీంతో పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకారులపై కాల్పుల వర్షాన్ని కురిపించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మంది మృతి చెందగా... అనేక మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో మరింత ఆగ్రహించిన ఆందోళనకారులు.. వాహనాలను చిత్తు చిత్తు చేశారు.
తద్వారా ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కేసుల్లో అరెస్ట్ చేసిన టీచర్ల సంఘం నేతలను విడుదల చేయాలని కోరుతూ నిరసనలు జరుగుతున్నాయి. మరోపక్క పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించాలంటే పోటీ పరీక్ష రాయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నియమాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తూ నిరసనకు దిగారు. ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంభవంతో మెక్సికో పరిసరప్రాంతాలు రక్తభూమిని తలపిస్తున్నాయి.