1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (16:54 IST)

కరోనా.. మ్యాన్ మేడ్ వైరస్.. పుట్టింది వుహాన్ ల్యాబ్‌లోనే...

కరోనా వైరస్‌ పుట్టుకపై జపాన్ ప్రొఫెసర్ ఒకరు సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ వైరస్ సహజసిద్ధమైనది కాదనీ, కృత్రిమంగా సృష్టించినదని జపాన్‌కు చెందిన వైద్య నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత తసుకు హొంజో వెల్లడించారు. 
 
నిజానికి ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిందనే ఆరోపణలు వున్నాయి. ఈ వైరస్ వూహన్ పరిశోధనాశాలలో తయారైందనీ, అక్కడ నుంచి మనుషులకు సంక్రమించిందనే వార్తలు వచ్చాయి. దీనిపై అమెరికా వంటి అగ్రదేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా అభివర్ణించారు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆదేశాల మేరకు చైనీస్ వైరస్ అని వ్యాఖ్యానించడం మానేశారు. 
 
ఈ పరిస్థితుల్లో నోబెల్ బహుమతి గ్రహీత తసుకు హొంజొ సంచలన వ్యాఖ్యలు చేశారు. వుహాన్ ల్యాబ్‌లో కరోనా తయారైందని, అక్కడి నుంచే ఇది మనుషులకు సంక్రమించిందని వాదిస్తున్నారు. కరోనా వైరస్ సహజసిద్దమైనది కాదని, వైరాలజి ల్యాబ్‌లో తయారు చేసిందని చెప్పుకొచ్చారు. 
 
తాను వుహాన్ వైరాలజి ల్యాబ్‌లో పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా వైరస్‌లపై ప్రయోగాలు చేసినట్టు తెలిపారు. వుహాన్ వైరాలజి ల్యాబ్‌లో పనిచేసిన టెక్నిషియన్స్ అందరితో మాట్లాడానని, కానీ, ఇప్పుడు వారి ఫోన్లు పనిచేయడం లేదని, అంటే వారంతా మరణించారని అన్నారు. 
 
కరోనా వైరస్ సహజసిద్దమైనదే అయితే, వుహాన్‌లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో అలాంటి వాతావరణంలో మాత్రమే అది ఎటాక్ చేస్తుంది. కానీ, స్విస్ వంటి చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ, ఎడారి ప్రాంతాల్లోనూ ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తోంది. 
 
వేడి ఎక్కువగా ఉంటే వైరస్ మరణించాలి. అలాకాకుండా ఇది వ్యాపిస్తుందంటే ఇది తప్పకుండా ల్యాబ్‌లో తయారు చేసిందని చెప్పొచ్చని అన్నారు. ఒకవేళ తన వాదన తప్పు అయితే తన నోబెల్ బహుమతిని వెనక్కి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు.