ఆస్ట్రేలియాలో కార్చిచ్చు

సోమవారం, 11 నవంబరు 2019 (20:47 IST)
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు రాజుకుని లక్షల ఎకరాల అడవి బూడిదవుతోంది. ఇప్పటికే 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యేసరికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. 
 
కార్చిచ్చుకు భారత రుతుపవనాల ఆలస్య తిరోగమనం కూడా ఓ కారణమే అంటున్నారు వాతావరణ నిపుణులు.  కార్చిచ్చు కారణంగా ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. వేలాది మంది నివాసం కోల్పోయారు. 
 
దావానలం వేగంగా జనావాసాల వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో సిడ్నీ, ఉత్తరాన ఉన్న హంటర్ వ్యాలీ ప్రాంతాల్లో మంగళవారం అత్యవసర స్థితి కొనసాగుతుందని ప్రకటించింది ప్రభుత్వం. మిగిలిన రాష్ట్రాలలోనూ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది.
 
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఎన్నడూలేనంత స్థాయిలో విజృంభించడానికి భారత్​లోని వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు నిపుణులు. 
 
"భారత దేశంలో గత నెల నుంచి రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలు ఇంకా తగ్గడంలేదు. సాధారణంగా ఆసియాలో జూన్​, సెప్టెంబర్​లో రుతుపవనాలు తిరోగమనం చెంది దక్షిణానికి మళ్లుతాయి. 
 
కానీ ఈసారి అలా జరగలేదు. అందుకే ఆస్ట్రేలియాలో వర్షాలు పడక వాతవరణం పొడిబారిపోయింది. ఇది మంటలు చెలరేగేందుకు సరైన స్థితి" ట్రెంట్​ పెన్హామ్​ వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments