శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (09:04 IST)

భారత్‌పై దాడికి చైనా సన్నాహాలు? టిబెట్‌కు చేరువలో చైనా బాంబర్లు

భారత్‌పై దాడి చేసేందుకు డ్రాగన్ కంట్రీ సన్నాహాలు చేస్తుందా? అనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. భారత్‌కు చేరువలో టిబెట్‌ భూభాగంలో తన సైనిక సత్తాను చైనా క్రమంగా పెంచడమే దీనికి నిదర్శనమని వారు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా, టిబెట్‌కు సమీపంలో చైనా బాంబర్ విమానాలను మొహరించడం ఇపుడు ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్తలు పెంచేలా ఉన్నాయి. 
 
తాజాగా హెచ్‌-6 అనే అధునాతన బాంబర్‌ విమానాలను మోహరించింది. హాపింగ్‌ వైమానిక క్షేత్రంలో వీటిని రంగంలోకి దించింది. ఇది భారత్‌లోని సిక్కిం సరిహద్దుకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పౌర, సైనిక విమానాల కార్యకలాపాలకు పనికొచ్చే ఈ స్థావరాన్ని చైనా సైన్యం పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. 155 ఎంఎం శతఘ్నులనూ అక్కడ మోహరించినట్లు సమాచారం.
 
సోవియట్‌ హయాం నాటి టుమోలెవ్‌ టీయూ-16 బాంబర్‌ ఆధారంగా హెచ్‌-6ను చైనా రూపొందించింది. ఇది దీర్ఘశ్రేణి దాడులకు పనికొస్తుంది. దీన్ని వ్యూహాత్మక బాంబర్‌గా కూడా పేర్కొంటున్నారు. అణ్వస్త్ర సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌకలపై దాడి చేయగల సత్తా దీనికి ఉందని భావిస్తున్నారు. ఇలాంటి ఆయుధాన్ని తన పొరుగున మోహరించడంపై భారత్‌ దృష్టి సారించింది. ఒకవేళ యుద్ధం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ బాంబర్‌ ఎలాంటి పాత్ర పోషించనుంది వంటి అంశాలపై భారత భద్రతా సంస్థలు విశ్లేషిస్తున్నాయి.