ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (17:45 IST)

బ్రెజిల్‌లో కుండపోత వర్షాలు... 14 మంది మృతి

బ్రెజిల్ దేశంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా రియో డి జెనీరో రాష్ట్రంలో ఈ వర్షాలు, వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
 
ఆగ్నేయ బ్రెజిలియన్ రాష్ట్రమై రియో డి జెనీరోలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగరంలోని పలు ప్రాతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 
 
గత 48 గంటల్లో అంగ్రాడోస్ రీస్‌లో అత్యధికంగా 655 మిల్లీ మీటర్ల (26 అంగుళాలు) వర్షం పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ వర్షాల కారణంగా నగరంలో ఆరుగురు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.