ఇజ్రాయేల్కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్
ఇరాన్ ఇజ్రాయేల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంచలన వార్నింగ్ ఇచ్చారు. రక్తానికి రక్తమే సమాధామని అన్నారు.
ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసిందని.. ఆ దేశాన్ని కచ్చితంగా శిక్షిస్తామన్నారు. ఇజ్రాయేల్- ఇరాన్ వ్యవహారంలో అమెరికా తలదూరిస్తే పర్యవసనాలు తీవ్రంగా వుంటాయని అలీ ఖమేనీ హెచ్చరించారు. అలాగే శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.
మరోవైపు ఇరాన్ అణుశుద్ధి స్థావరాలను దెబ్బతీయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నంతాజ్ అణుశుద్ధి కర్మగారంపై దాడులు చేసింది. మరో కీలక అణు శుద్ధి కేంద్రమైన ఫోర్డోపై ఇజ్రాయెల్ దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే వీటిపై బంకర్ బస్టర్ బాంబులు ఉపయోగించాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేస్తోంది. ఈ బంకర్ బస్టర్ బాంబులు అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి. ఈ బాంబులు తమకు ఇవ్వాలని ఇజ్రాయెల్ అమెరికాను విజ్ఞప్తి చేస్తోంది. అయితే దీనికి ఇంకా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.