1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:18 IST)

భార‌త ప్ర‌ధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాల‌ని వుంది: పాక్ ప్రధాని

భారత్-పాకిస్థాన్ సంబంధాలు మళ్లీ బలపడే సూచనలు కనిపించట్లేదు. ముంబై పేలుళ్ల తర్వాత భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు అంతంతమాత్రమే. అలాగే కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌రువాత పాక్‌తో సంబంధాలు మ‌రింత దిగ‌జారాయి. పాక్ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు స్వ‌స్తి ప‌లికితేనే ఆ దేశంలో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని ఇండియా ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.
 
ఇక ఇదిలా ఉంటే, పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ భార‌త్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. భార‌త ప్ర‌ధానితో టీవీ డిబేట్‌లో పాల్గొనాల‌ని ఉంద‌ని, ఈ డిబేట్ ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ఒక ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ఆశిస్తున్నాన‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. 
 
పీఎం మోడీ రెడీ అంటే తాను సిద్దంగా ఉన్నాన‌ని, టీవీ ఛాన‌ల్ డిబేట్‌లో పాల్గొన‌డం ద్వారా రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాలు కొంత‌మేర మెరుగుప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని పాక్ పీఎం పేర్కొన్నారు. మ‌రి దీనిపై మనదేశ ప్ర‌ధాని ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.