1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (14:40 IST)

మాది దేశ అజెండా - ప్రతిపక్షాలది పాకిస్థాన్ అజెండా : ప్రధాని మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. తమ దేశ అజెండా అని, విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అంటూ ధ్వజమెత్తారు. దేశభక్తి, అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకునే ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తాను చేపట్టిన పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఫజిల్కా జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు చూపమంటూ డిమాండ్ చేస్తున్న విపక్ష పార్టీలది పాకిస్థాన్ అజెండా అని ఆరోపించారు. 
 
గతంలో ఒకరు పంజాబ్‌ను గతంలో లూటీ చేశారని, మరొకరు ఇపుడు ఢిల్లీలో కుంభకోణాలకు పాల్పడున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఉద్దేశించి ఆయన విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు ఒకేతాను ముక్కలేనని, ఇపుడు కుస్తీపట్టినట్టు డ్రామాలు ఆడుతాయని ఎద్దేవా చేశారు. 
 
అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్ సోదరులను రావొద్దన్న పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీపై ఆయన విమర్శలు చేశారు. గురుగోవింద్ సింగ్ సంత్ రవిదాస్ ఎక్కడ పుట్టారంటూ ఆయన నిలదీశారు. గురుగోవింద్ సింగ్ బీహార్‌లోని పాట్నా సాహిబ్‌లో జన్మిస్తే, సంత్ రవిదాస్ యూపీలోని వారణాసిలో జన్మించారని గుర్తుచేశారు. అంటే ఈ రెండు రాష్ట్రాల ప్రజలను రావొద్దనంటే వారిని అవమానించినట్టేనని ప్రధాని వ్యాఖ్యానించారు.