శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (11:33 IST)

ఆ దేవుడు శక్తినిస్తే అది చేసి చూపుతా : విశ్వసుందరి

2018 సంవత్సరానికిగాను విశ్వసుందరిగా ఫిలిప్పిన్స్‌కు చెందిన భామ ఎన్నికైంది. మొత్తం 94 మంది పోటీపడగా క్యాట్రియోనో ఎలైసా గ్రే ఫైనల్ పోటీల్లో నిలిచి విజేతగా ఎంపికైంది. ఫిలిప్పిన్స్ నుంచి విశ్వసుందరిగా ఎన్నికైన నాలుగో అమ్మాయి ఎలైసా కావడం గమనార్హం. 
 
ఈ పోటీల్లో ఎలైసాకు ఒక్క అందమే కాదు.. తెలివి తేటలు కూడా అలంకారప్రాయమయ్యాయి. ఫైనల్స్‌లో జడ్జీలు అడిగిన ప్రశ్న, చెప్పిన సమాధానం కూడా పస్ల్ అయ్యింది. "జీవితంలో నేర్చుకున్నగుణపాఠం ఏంటీ?, మిస్ యూనివర్స్‌గా ఆ సమస్యను ఎలా చూస్తారు? అనే ప్రశ్నను జడ్జిలు సంధించారు. దీనికి ఎలైసా గ్రే స్పష్టంగా సమాధానం చెప్పి జడ్జిల మనసులను గెలుచుకుంది.
 
"మనీలాలోని మురికివాడల్లోని చిన్నారులను చూసినప్పుడు ఎంతో బాధేసింది. వారి ముఖాల్లో చిరునవ్వును, అందాన్ని చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఆ దేవుడు శక్తి ఇస్తే ఆ చిన్నారుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తా. వారికి మంచి, చెడులు, విద్య అందిస్తా" అని చెప్పారు. ఈ సమాధానానికి ఫిదా అయిన జడ్జీలు ఆమెకు విజేతగా ప్రకటించారు.
 
కాగా, ఎలైసా గ్రే ఒక సాధారణమైన యువతి కాదు. మ్యూజిక్ థీయరీలో మాస్టర్ డిగ్రీ చేసింది. ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫస్ట్ రన్నరప్‌గా సౌతాఫ్రికాకి చెందిన టామేరిన్ గ్రీన్ సెలక్ట్ అయ్యింది. సెకండ్ రన్నరప్‌గా వెనిజులా బ్యూటీ స్తేఫనీ నిలిచింది.