1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 సెప్టెంబరు 2022 (18:38 IST)

బ్రిటన్‌ రాణి మరణానంతరం ఇంద్రధనస్సులు.. బంగారు వర్ణంలో మేఘం

Rainbow
Rainbow
బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మరణానంతరం ఆమె నివసించిన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా రెండు ఇంద్రధనస్సులు కనిపించాయి. అలాగే ఒక నగరంపై ఆకాశంలో ఎలిజబెత్‌ రూపంలో, బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఆకట్టుకుంది. 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌, స్కాట్లాండ్‌లోని వేసవి విడిది నివాసంలో వుండగా గురువారం కన్నుమూశారు. 
 
ఈ ప్రకటన చేసిన కొన్ని నిమిషాల తర్వాత ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది. 
 
లిన్నేఅనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గుర్తించింది. అమ్మా.. 'క్వీన్‌' అని అరిచిన ఆ బాలిక ఎలిజబెత్‌ రూపంలో ఉన్న ఆ మేఘాన్ని తల్లికి చూపించింది. 'ఓ మై గాడ్‌' అంటూ ఆమె షాక్ అయ్యింది. 
 
దీంతో కారును నిలిపిన ఆ మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, క్వీన్‌ ఎలిజబెత్‌ను పోలిన బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఫొటో వైరల్‌ అయ్యింది.