వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చు.. ఫేస్‌బుక్

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:13 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు ఇప్పట్లో ఆఫీస్‌కు రానవసరం లేదని, వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చునని ప్రకటించింది. అంతేకాదు ఆఫీస్ అవసరాల కోసం వెయ్యి డాలర్లు ఇస్తామని కూడా తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య నిపుణులు, ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. 
 
2021, జూలై వరకు ఇంటి నుంచే పనీచేసుకోవచ్చని, ఇంట్లో ఆఫీస్ అవసరాల నిమిత్తం రూ.74,983 (వెయ్యి డాలర్లు) చెల్లిస్తామని ఎఫ్‌బీ అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పలుచోట్ల ఆఫీసులను నడిపిస్తున్నామని వెల్లడించారు. కరోనా కేసులు పెరగుతుండటంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని చెప్పారు.

అన్నీ చూడండి

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

తర్వాతి కథనం
Show comments