1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (10:30 IST)

రిలయన్స్ జియో గుడ్ ‌న్యూస్.. 2017 మార్చి వరకు వెల్‌కమ్ ఆఫర్

రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జియో మొబైల్ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌ను వచ్చే యేడాది మార్చి నెలాఖరు వరకు పొడగించాలని నిర్ణయించ

రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం జియో మొబైల్ వినియోగదారులకు వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తున్న వెల్‌కమ్ ఆఫర్‌ను వచ్చే యేడాది మార్చి నెలాఖరు వరకు పొడగించాలని నిర్ణయించింది. 
 
వాస్తవానికి ఈ ఆఫర్ కింద డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో కాల్స్ అందించనున్నట్టు ప్రకటించింది. అయితే, ఇప్పుడా ఆఫర్‌ను మార్చి 2017 వరకూ అందించాలని భావిస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన డిసెంబర్ 28న ప్రకటించనున్నట్టు సమాచారం. 
 
ఉచిత ఆఫర్ తరువాత జియో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అనుకున్న స్థాయిలో కస్టమర్లు రాకపోవడంతోనే ఆఫర్‌ను పొడిగించాలని జియో అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, జియో ఆఫర్లలో భాగంగా 1 జీబీ డేటా రూ. 50కే లభిస్తుందన్న సంగతి తెలిసిందే.