పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ: ముగ్గురూ ఒకేసారి రాజీనామా?

శుక్రవారం, 24 డిశెంబరు 2021 (15:46 IST)
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సంస్థకు చెందిన ముగ్గురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్ళిపోయారు. రాజీనామాలు చేసిన వారిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్ లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ గుప్తా ఉన్నారు.
 
వీరు ముగ్గురూ ఒకరివెంట మరొకరు రాజీనామా చేసినట్టు సమాచారం. అభిషేక్ అరుణ్ ఐదేళ్లకు పైగా పేటీఎంలో ఉన్నారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గత ఏడాదే పేటీఎంలో చేరారు. 
 
అయితే వీరు రాజీనామాలు చేసినట్టు పేటీఎం అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఇటీవలే పేటీఎం ఐపీఓకు వెళ్లింది.
 
అయితే ఈ ఐపీఓ ఆదిలోనే నిరాశపరిచింది. ఈ తరుణంలో ముగ్గురు టాప్ లెవెల్ అధికారులు బయటకు వెళ్లడం కంపెనీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments