శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (18:04 IST)

కొత్తిమీర కట్టలను డ్రైనేజీ నీటిలో కడిగిన వ్యాపారి.. (వీడియో వైరల్)

Bhopal
ఆకుకూరలు, పౌష్టికాహారమైన కూరగాయలు తినాలని వైద్యులు, నిపుణులు చెబుతుంటారు. కానీ.. వ్యాపారం నిర్వహించే కొంతమంది కక్కుర్తికి ఆశపడి…పాడు పనులు చేస్తుంటారు. కల్తీలు చేయడంలాంటి పనులకు పాల్పడుతుంటారు. ఆరోగ్యానికి ఎంతో దోహదపడే.. ఆకుకూరల విషయంలో ఇలాగే చేస్తుంటారు. 
 
ఓ వ్యాపారి కొత్తిమీర కట్టలను మురికినీటిలో కడిగిన ఘటనపై భోపాల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కూరగాయల విక్రేతపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
వివరాల్లోకి వెళితే..భోపాల్ లోని ఓ ప్రాంతంలో కూరగాయలు విక్రయించే ఓ వ్యాపారి పక్కనే ఉన్న డ్రైనేజీ నీటిలో కొత్తిమీర కట్టలను కడగడం ఓ వ్యక్తి కంటపడింది. వెంటనే దానిని వీడియో తీశాడు. వీడియో తీస్తున్నా..ఆ యువ వ్యాపారి భయపడలేదు. ముసిముసి నవ్వులు నవ్వుతూ.. వీడియో తీయవద్దని.. తన దగ్గర ఎవరూ కొనరని వీడియోలో చెప్పడం వినిపించింది. sudhirdandotiya అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. 
 
అందులో భోపాల్ కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. దీంతో ఆ వీడియో భోపాల్ కలెక్టర్ Avinash Lavania దృష్టికి చేరింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…వెంటనే చర్యలు తీసుకోవాలంటూ..ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ..పలువురు ఉన్నతాధికారులకు హ్యాష్ ట్యాగ్ చేశారు. అతడిని గుర్తించాలని పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ సంబంధించిన శాఖను ఆదేశించారు.