శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (15:23 IST)

అమెజాన్‌కు చెక్.. మైక్రోసాఫ్ట్, టెన్సెంట్‌, ఇబేలతో చేతులు కలిపిన ఫ్లిప్ కార్ట్..

దేశీయ ఇ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు చెక్ పెట్టే దిశగా భారీ నిధులను సేకరించింది. టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇబే సంస్థల నుంచి ఫ్లిప్ కా

దేశీయ ఇ-కామెర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. గట్టిపోటీనిస్తున్న ప్రత్యర్థి సంస్థ అమెజాన్‌కు చెక్ పెట్టే దిశగా భారీ నిధులను సేకరించింది. టెన్సెంట్ హోల్డింగ్స్, మైక్రోసాఫ్ట్ కార్ప్, ఇబే సంస్థల నుంచి ఫ్లిప్ కార్ట్ భారీగా 1.4 బిలియన్ డాలర్ల మేరకు నిధులను సేకరించింది. 2015 సంవత్సరంలో ఫ్లిప్ కార్ట్ విలువ 15 బిలియన్ డాలర్లుండగా, ప్రస్తుతం ఇది 23 శాతం క్షీణించి 11.6 బిలియన్ డాలర్లకు చేరింది. 
 
సంస్థ విలువ పడిపోతున్న నేపథ్యంలో కంపెనీ నిధుల సేకరణ వేటలో పడింది. అంచనాలకు అనుగుణంగానే మెగా డీల్ సాధించింది. ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఇబేను కూడా ఫ్లిప్ కార్టు కొనుగోలు చేసింది. ఇబే కూడా భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించడం ద్వారా భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో టెన్సెంట్ వ్యూహాత్మకంగా భాగస్వామిగా, ఇబే ఫ్లిప్ కార్ట్‌లో స్వతంత్ర సంస్థగా కొనసాగనుంది. తద్వారా టెక్నాలజీ ద్వారా దేశీయ వాణిజ్య రంగ దిశను మార్చాలనే తమ అభిలాష ఈ నిధుల సేకరణ, ఒప్పందాల ద్వారా నెరవేరనుందని ఫ్లిఫ్ కార్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజా ఒప్పందంతో చైనాలో ఇంటర్నెట్‌కు సంబంధించిన సేవలను టెన్‌సెంట్ భారత్‌లో ఈ కామర్స్, చెల్లింపుల విధానంలో పాలు పంచుకునేందుకు అవకాశం లభించింది. ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు మంచి సర్వీస్‌ను అందించడంలో సాయం అందిస్తామని కంపెనీ అధినేత మార్టిన్ లా తెలిపారు.