పరీక్షలా.. అయితే విద్యార్థులు హాయిగా నిద్రపోండి..!

సెల్వి
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:07 IST)
పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని దూరం చేయాలంటే.. హాయిగా నిద్రపోవాలంటున్నారు వైద్యులు. నిద్ర అనేది అయోమయాన్ని తొలగిస్తుంది. మెదడుకు ఉత్తేజాన్నిస్తుంది. గరిష్ట పనితీరులో అమలు చేయడానికి సిద్ధం చేయడం లాంటిది. తద్వారా పిల్లలు వేగంగా ఆలోచిస్తారు, జ్ఞాపకశక్తి మెరుగ్గా వుంటుంది. 
 
పిల్లల్లో మెదడులోని సమాచారాన్ని పటిష్టం చేయడంలో నిద్ర సహాయపడుతుంది. కాబట్టి టెన్షన్‌ను పక్కనబెట్టి పగలంతా బాగా చదివి.. రాత్రి నిద్ర పోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఒత్తిడి ఇట్టే మాయం అవుతుంది. నిద్ర సహజంగా ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. అందుచేత ప్రశాంతంగా చదువులపై దృష్టి సారించేలా చేస్తుంది.  
 
నిద్ర లేకపోవడం ఎవరికైనా చికాకు కలిగిస్తుంది. కానీ మంచి రాత్రి విశ్రాంతి మానసిక స్థితిని పెంచుతుంది. నిద్రలేమి మీ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కానీ తగినంత విశ్రాంతి తీసుకుంటే, విద్యార్థుల మనస్సు పరీక్షలపై దృష్టి మళ్లుతుంది. 
 
పరీక్షలు ఒత్తిడితో కూడుకున్నవి. ఒత్తిడి రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీని వలన విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులకు నిద్ర శత్రువు కాదు, పరీక్షలో విజయం సాధించే మార్గంలో నిద్ర విద్యార్థులకు బెస్ట్ ఫ్రెండ్. సో హాయిగా నిద్రపోతే.. పరీక్షల్లో విజయం సాధించవచ్చు. 

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments