1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (09:40 IST)

పూణెలో దారుణం - బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అత్యాచారం

మహారాష్ట్రలోని పూణెలో ఓ అమానవీయ సంఘటన జరిగింది. కన్నబిడ్డపై ఐదేళ్లుగా కన్నతండ్రి అత్యాచారం చేస్తూ వచ్చాడు. అతనేకాదు తోడబుట్టిన సోదరుడు, తాత, మావయ్యలు కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం స్కూల్‌లో ఉపాధ్యాయలు ఇటీవల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులందరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం పుణెలో ఉంటోంది. వీరిలో 11 యేళ్ల బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటుంది. అయితే, ఇటీవల పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఆ బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 
 
2017 నుంచి తండ్రే అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు చెప్పింది. అలాదే తన అన్న కూడా గత 2020 నుంచి ఈ నీచానికి పాల్పడుతున్నట్టు బోరున విలపిస్తూ చేపింది. వీరిదిద్దరే కాదు, తాత, మామయ్యలు కూడా ఈ తరహా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు వెల్లడించింది. 
 
దీంతో కౌన్సెలింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇది సామూహిక అత్యాచారం కాదని, నిందితులంతా వేర్వేరు సమయాల్లో ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని పెల్లడించారు.