పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. హత్రాస్లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
శుక్రవారం సాయంత్రం బాలిక తన కుటుంబ పొలం సమీపంలోని గొట్టపు బావి పక్కన కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగిందని సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ హిమాన్షు మాథుర్ తెలిపారు. పొరుగు గ్రామానికి చెందిన నిందితుడు ఆమెను సమీపంలోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. పొలంలో ఆమెను గుర్తించిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మాథుర్ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపిన తర్వాత బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు.