Ice Cream: ఐస్క్రీమ్లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?
ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు. అలాంటి ఐస్క్రీమ్లో చనిపోయి బాగా ఫ్రీజ్ అయిన బల్లి కనిపిస్తే అంతే.. ఐస్ క్రీమ్ను విసిరి పారేస్తాం. అలాంటి ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్లోని లూధియానాలో ఏడేళ్ల బాలుడి ఐస్ క్రీం లోపల ఫ్రీజ్ అయిన బల్లి కనిపించింది. ఆ కుటుంబం ఆ పిల్లవాడి కోసం వీధిలో అమ్మే ఐస్ క్రీమ్ వ్యాపారి వద్ద కొనిచ్చారు. ఇందుకోసం రూ.20 లను చెల్లించారు.
వారు దానిని విప్పి కొన్ని సెకన్ల తర్వాత, అందులో బల్లి వుండటం చూసి ఆ పిల్లవాడు షాక్ అయ్యాడు. బాలుడు వెంటనే తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. బాలుడి అమ్మమ్మ ఐస్ క్రీం అమ్మేవాడిని నిలదీసింది.
ఎవరెన్ని తిట్టినా.. ఈ షాకింగ్ కేసు నమోదైన తర్వాత కూడా అతను ఐస్ క్రీంలు అమ్ముతూనే ఉన్నాడు. బల్లిపడిన ఐస్ క్రీమ్ తిన్న బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం అతని ఆరోగ్యం నిలకడగా వుంది. ఈ ఘటనపై ఆరోగ్య శాఖాధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది.