1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (22:38 IST)

ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని ఖోపొలి సమీపంలో ఉన్న ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ వేపై జరిగింది. జాతీయ రహదారిపై వాహనాలు రయ్యిరయ్యిన వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఒకేసారి ఆరు వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఇద్దరు మరణించగా.. కోళ్ల వ్యానులో ఉన్న మరొకరు మరణించినట్లు ఖోపోలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శిరీష్ పవార్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కున్న బాధితులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
 
ఈ ఘటన అనంతరం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయిందని.. క్లియర్ చేసేందుకు కొంత సమయం పట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖోపోలి పోలీసులు తెలిపారు.