1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:50 IST)

ఈ మానవ మృగాలు మారవా? 11 ఏళ్ల బాలికపై వృద్ధుడి అత్యాచారం..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో మానవ మృగాలు మాత్రం మారట్లేదు. నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా.. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మృగాలు రెచ్చిపోతున్నారు. 
 
కరోనా వ్యాప్తి చేయకుండా లాక్‌డౌన్ విధిస్తే.. కీచకులకు మాత్రం అదే వరంలా మారుతోంది. తాజాగా 11 ఏళ్ల బాలికపై ఓ 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన దర్శి మండలం కోర్లమడుగులో చోటుచేసుకుంది. కాగా.. అత్యాచారం చేసి అనంతరం నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.