సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 అక్టోబరు 2024 (19:58 IST)

కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చెప్తుంటే.. బంగారు గొలుసు కొట్టేశాడు.. (video)

woman
woman
నవరాత్రుల సందర్భంగా గుడిలో కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుకుందామని వెళ్లిన ఆ మహిళకు చుక్కలు కనిపించాయి. కిటికీల పక్కన కూర్చుని హాయిగా శ్లోకాలు చదువుతున్న ఆ మహిళపై చోరీ జరిగింది. 
 
బెంగళూరు - మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్‌లోని గణేష్ గుడిలో కిటికీ పక్క కూర్చొని శ్లోకాలు చదువుతున్న మహిళ మెడలో నుండి బంగారు గొలుసును ఓ దొంగ కొట్టేశాడు.
 
బంగారు గొలుసు లాక్కెళ్లిన విషయం గమనించిన మహిళ లబోదిబోమంటూ విలపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.