శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 1 జనవరి 2019 (16:02 IST)

ప్రకాష్ రాజ్ కీలక నిర్ణయం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..

కొత్త సంవత్సరం ప్రారంభమైన వేళ దేశ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
ఇంకా కొత్త సంవత్సరం అన్నాక.. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాష్ రాజ్ కొత్త సంవత్సరం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. తన ట్వీట్‌లో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
మీ అందరి మద్దతుతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానన్నది.. త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. దేశంలో ప్రజా ప్రభుత్వం రానుందని.. చివర్లో #Citizensvoice #Justasking పార్లమెంట్‌లో కూడా అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టారు. ఇక ప్రకాష్ రాజ్ రాజకీయ అరంగేట్రంపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ రాజకీయాల్లో కూడా రాణించాలని ఆశిస్తున్నారు.