ఎయిర్ ఇండియా ప్రమాదం- 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచ్ అయ్యాయి..
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ఇప్పటివరకు 87 మంది మృతుల డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా గుర్తించామని, 47 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు సోమవారం తెలిపారు.
జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం తర్వాత చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మృతులు గుజరాత్లోని భరూచ్, ఆనంద్, జునాగఢ్, భావ్నగర్, వడోదర, ఖేడా, మెహ్సానా, అర్వల్లి, అహ్మదాబాద్ జిల్లాల వంటి వివిధ ప్రాంతాలకు చెందినవారని అదనపు సివిల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ విలేకరులకు తెలిపారు.
జూన్ 12న మధ్యాహ్నం 1.39 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే 242 మందితో కూడిన బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ అహ్మదాబాద్లోని ఒక వైద్య కళాశాల సముదాయంలో కూలిపోయింది.
లండన్ వెళ్తున్న విమానంలో 241 మంది మరణించగా, ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా, ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు సహా ఈ విపత్తులో 29 మంది మరణించినట్లు సమాచారం.