అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో ఎయిరిండియాకు చెందిన విమానం రన్ వే పైనుంచి టేకాఫ్ చేస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం చెట్టుని ఢీకొట్టి భారీ శబ్దం చేస్తూ కూలిపోయినట్లు సమాచారం. కాగా ఈ విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులు వున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.