పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్లో అవాంతరమా?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు, 10 మంది విమాన సిబ్బందితో పాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం లండన్కు బయలుదేరిన తర్వాత చెట్టును ఢీకొని కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం.
అయితే, ఈ విమానం వెనుక ఏదేని కుట్రకోణం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. అదేసమయంలో విమానం పైలెట్ల వైపు నుంచి కూడా లోపం ఉందా అనేది తెలియాల్సివుంది. ముఖ్యంగా ఈ విమానం ప్రధాన పైలెట్కు 8200 గంటలపాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. దీంతో పైలెట్ పరంగా ఎలాంటి సమస్య ఉండే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఏదైనా కుట్రకోణం దాగివుందా? అనే కోణంలో విచారిస్తున్నారు.