గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2016 (12:06 IST)

అమ్మ 'దేవత' అవుతుందా? జయ సమాధి వద్ద తలనీలాలు, పెండ్లిళ్లు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన దేవుడు అంటూ ఆయన ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకుని పూజలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా అక్కడి ప్రజలు దేవతను చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. మెరీనా తీరం వద్ద ఆమె సమాధి వద్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించినప్పుడు ఆయన దేవుడు అంటూ ఆయన ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకుని పూజలు చేశారు. ఇటీవలే కన్నుమూసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కూడా అక్కడి ప్రజలు దేవతను చేసేస్తున్నట్లు కనిపిస్తోంది. మెరీనా తీరం వద్ద ఆమె సమాధి వద్ద జయ అభిమానులు తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ తంతు గత వారం నుంచి అలా సాగుతూనే ఉంది. తాజాగా జయను ఆరాధిస్తున్నవారు మరో అడుగు ముందుకు వేశారు. 
 
అదేమిటంటే... ఆమెను దేవతగా కొలుస్తూ ఆమె సమాధి వద్ద పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అన్నాడీఎంకె యువజన విభాగం నాయకుడు ఫ్రాన్సిస్, రెజీలా ప్రీతిలు వచ్చే ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోవాల్సి ఉండగా, శుభలేకను జయకు ఇచ్చారట. అప్పట్లో జయ తన పెళ్లికి తప్పక వస్తానని చెప్పారట. కానీ విధి వక్రీకరించి ఆమె తనువు చాలించడంతో ఫ్రాన్సిస్ దుఃఖంలో మునిగిపోయాడు. 
 
తన పెళ్లికి అమ్మ రాదని తెలిసి ఆవేదన చెందిన ఫ్రాన్సిస్ తన పెళ్లిని జయ సమాధి వద్ద చేసుకోవాలని నిశ్చయించాడు. అనుకున్నదే తడవుగా పెళ్లి కుమార్తె బంధువులు, వరుడు బంధువులంతా జయ సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడే వీరిద్దరూ దండలు మార్చుకుని పెళ్లి చేసేసుకున్నారు.