శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (22:08 IST)

ఎంబీఏ విద్యార్థిని కిడ్నాప్, రాడ్‌తో కొట్టి నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

మీరట్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆమెను ఇనుప రాడ్‌తో కొట్టి సామూహిక అత్యాచారం చేసినట్లు పోలీసులు శుక్రవారం రాత్రి తెలిపారు. నిన్న రాత్రి వరకు విద్యార్థిని ఇంటికి చేరుకోకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌ సిగ్నల్స్ ద్వారా ఆమె వున్న లోకేషన్‌ను గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లోని సియానాలో ఆమె గాయాలతో పడి వుండటంతో అక్కడి నుంచి ఆమెను రక్షించారు.
 
"బాధితురాలిని బులంద్‌షహర్‌లోని సియానా నుంచి పోలీసులు రక్షించారు. కేసు నమోదై దర్యాప్తు జరుగుతోంది" అని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్న నేపధ్యంలో ఆమెను అత్యవసర మెడికల్ విభాగంలో వుంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.