1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (09:39 IST)

బలవంత మత మార్పిడులకు పాల్పడితే ఐదేళ్ళ జైలు

ఇటీవలికాలంలో దేశంలో బలవంతపు మతమార్పిడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, తమ జనాభా సంఖ్యను పెంచుకునేందుకు కొన్ని క్రైస్తవ మిషనరీలు బలవంతపు మతమార్పిడులను అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. దీంతో బలవంతపు మతమార్పిడులు చెక్ పెట్టేలా ఓ బిల్లును రూపొందించి, దాన్ని ఆమోదించింది.
 
ఇపుడు కర్నాటక అసెంబ్లీ కూడా ఇలాంటి కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసలన మధ్య మత మార్పిడి నిరోధక బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసింది. ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీతో పాటు.. అనేక క్రైస్తవ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 
 
కానీ, కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆర్సెస్ ఎజెండా అంటూ మండిపడ్డారు. 
 
కాగా, ఈ బిల్లు ప్రకారం బలవంతంగానీ, ప్రలోభాలకు గురిచేయడం ద్వారా గానీ, మోసపూరిత విధానాల ద్వారా కానీ మతమార్పిడికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. గరిష్టంగా ఐదేళ్ళ వరకు జైలుశిక్ష పడుతుంది. రూ.50 వేల వరకు అపరాధం విధిస్తారు. నాన్ బెయిలపు కేసులు నమోదు చేస్తారు.