ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (13:42 IST)

ప్రేమను నిరూపించుకునేందుకు ప్రియుడి హెచ్.ఐ.వి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

lovers
తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ ప్రియురాలు మూర్ఖత్వపు పని చేసింది. ప్రేమను నిరూపించుకునేందుకు హెచ్.ఐ.వితో బాధపడుతున్న ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకుంది. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని సౌల్‌కుచి జిల్లాలో 15 యేళ్ళ బాలికకు ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. వారి పరిచయం కాస్త్ ప్రేమగా మాడింది. ఇది చివరకు గాఢ ప్రేమగా మారింది. దీంతో ఆ అబ్బాయితో కలిసి ఆమె అనేక సార్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నచ్చజెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు తీసుకొచ్చారు. దీంతో ఆమె తన ప్రేమను మరింత బలంగా నిరూపించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆ తర్వాత ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా హెచ్.ఐ.వి.తో బాధపడుతున్న తన ప్రియుడి రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా బయటకు తీసింది. ఆ తర్వాత అదే రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకుంది. ఇపుడైనా తన ప్రేమను అర్థం చేసుకుని తన ప్రియుడితో పెళ్లి చేయాలని తల్లిదండ్రులను ప్రాధేయపడింది.