శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (18:05 IST)

జాతీయ జెండాకి గౌరవం ఇవ్వలేదు.. ప్రోటోకాల్ పేరుతో జాతీయ జెండాను అగౌరవరం

national flag
దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇదే నినాదం వినిస్తోంది. ఊరు, వాడాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  
 
అయితే ఒకటి రెండు చోట్ల మాత్రం తప్పులు దొర్లుతున్నాయి. రాజమండ్రిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆజాదిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ జెండా కింద నుంచి వెళ్లిపోయారు అధికారులు.
 
ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వాహనాలు.. జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతం నుంచి.. కనీసం మాకు పట్టనట్టు జెండా పైకి లేపి మరి కింద నుంచి వెళ్లిపోయారు. 
 
దీంతో ప్రజాప్రతినిధుల, అధికారులు వాహనాలు. గంటల తరబడి జెండాను పట్టుకుని ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు స్థానిక ఉద్యోగులు. జాతీయ జెండాకి గౌరవం ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ వాహనం కూడా నిర్లక్ష్యంగా వెళ్లిపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.