కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)
బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మరణించారు. వీరిలో హాసన్ జిల్లా వాసి భూమిక్ (20) కూడా ఉన్నారు. ఇంటిలో చెప్పాపెట్టకుండా ఈ రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఊరేగింపు కోసం వెళ్లి మృత్యువాతపడ్డాడు. ఇంజనీరింగ్ చదువుతున్న భూమిక్.. మృతితో అతని తల్లి తల్లడిల్లోపోతున్నారు.
వంద కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి భూమిక్ కోసం పెట్టానంటూ కొడుకు సమాధి వద్ద తండ్రి బోరుమంటున్న వీడియోను చూసిన ప్రతి ఒక్కరినీ కలసివేస్తోంది. హాసన్ జిల్లా బేలూరు తాలూకా కుప్పుగోడుకు చెందిన లక్ష్మణ, అశ్విని దంపతులకు ఏకైక కుమారుడు భూమిక్. బెంగుళూరులో ఉంటూ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
కాలేజీ స్నేహితులతో కలిసి చిన్నస్వామి స్టేడియం వద్దకెళ్లిన తొక్కిసలాటలో మరణించాడు. విక్టోరియా ఆస్పత్రిలో గురువరం పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత భూమిక్ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అయితే తన బిడ్డ మృతిని జీర్ణించుకోలేక ఆ తండ్రి పడుతున్న వేదన అంతఇంతా కాదు. కొడుకును పాతిపెట్టిన సమాధిపై పడి రోదిస్తున్నాడు. కొడుకా.. లేవరా... రూ.100 కోట్ ఆస్తి రాసిపెట్టాను.. అంటూ విలపించడం ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టిస్తుంది.