క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకు?
బెంగుళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్.సి.బి) జట్టు సన్మాన కార్యక్రమం సందర్బంగా జరిగిన తొక్కిసలాట ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.
నైజ హోరాటగారర వేదిక తరపున ఏఎం వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. ప్రముఖ క్రికెటర్ అయిన కోహ్లీపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఇప్పటికే చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై నమోదైన ఎఫ్ఐఆర్తో కలిపి దీనిని కూడా విచారణకు పరిగణనలోకి తీసుకుంటామని వెంకటేశ్కు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఈ తొక్కిసలాట ఘటనపై కర్నాటక పోలీసులు ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కేఎస్సీఏ పాలక కమిటీలు అవసరమైన అనునుతులు లేకుండానే విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు.