1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (10:47 IST)

బీజేపీ ఎమ్మెల్యే కుమారుడితో సహా 25 జంటలకు సామూహిక వివాహాలు

marriage
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కుమారుడుతో సహా 25 మంది పేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. ఉటేజ్ గ్రౌండ్‌లో ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవార్ ఈ సామూహిక వివాహాలను దగ్గరుండి జరిపించారు.

ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్, కేంద్ర మంత్రి రావు సాహెబ్ దాన్వే తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నిరుపేదల కోసం సామూహిక వివాహ వేడుకను నిర్వహించడానికి బీజేపీ ఎమ్మెల్యే కృషిని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అభినందించారు. ఇతర నాయకులు కూడా ఇదే తరహాలో చొరవ చూపించాలని సూచించారు.