1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:06 IST)

మధ్యప్రదేశ్‌లో దయనీయస్థితి ... తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తరలించిన బాలుడు

pushcart
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో వైద్య సదుపాయాలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పడానికి ఈ దృశ్యం చాలు. అనారోగ్యంతో బాధడుతున్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే వారి వైపు నుంచి సరైన స్పందన లేదు. దీంతో తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు ఆరేళ్ళ బాలుడు తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన నెటిజన్లను కంటతడిపెట్టిస్తుంది. ఈ ఘటన ను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. సింగ్రౌలీకి చెందిన షా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువకావడంతో షాను ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆయన భార్య, ఆరేళ్ల కొడుకు ప్రయత్నించారు. 
 
అంబులెన్స్ కోసం ఆస్పత్రికి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన లేదు. నిరుపేద కుటుంబం కావడంతో ఆటోలో తీసుకెళ్లేంత సొమ్ము లేదు. ఏం చేయాలో తోచక చివరకు తోపుడు బండిపై షాను ఆస్పత్రికి తీసుకెళ్లాలని తల్లీకొడుకులు నిర్ణయించారు. ఇద్దరూ కలిసి షా ను తోపుడు బండిపై చేర్చారు. ఆ పై బండిని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.