Air India crash: మృతులకు కోటి రూపాయల నష్టపరిహారం.. 11A సీటులో వ్యక్తికి ఏమైంది?
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి చొప్పున అందజేస్తుందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గురువారం ప్రకటించారు.
గాయపడిన వారి వైద్య ఖర్చులను టాటా గ్రూప్ భరిస్తుందని, వారికి పూర్తి సంరక్షణ, మద్దతు లభిస్తుందని కూడా ఆయన అన్నారు. "ఈ సమయంలో మేము అనుభవిస్తున్న దుఃఖాన్ని పదాలు తగినంతగా వ్యక్తపరచలేవు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో, గాయపడిన వారితో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి.
టాటా గ్రూప్ తన సహాయ ప్రయత్నాలలో భాగంగా బి.జె. మెడికల్ కాలేజీలో కొత్త హాస్టల్ను నిర్మించడంలో కూడా సహాయం చేస్తుంది. ఈ ఊహించలేని సమయంలో బాధిత కుటుంబాలు, సమాజాలకు మేము అండగా నిలుస్తాము" అని అన్నారు.
అహ్మదాబాద్లో జరిగిన విపత్తులో 40 ఏళ్ల విశ్వాష్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఆ ఘోర ప్రమాదం నుండి బయటపడ్డాడు. విశ్వాష్ అనే వ్యక్తికి ఛాతీ, కళ్ళు, పాదాల గాయాలతో బయటపడ్డాడు. "టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత, పెద్ద శబ్దం వచ్చింది. తరువాత విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగింది" అని విశ్వాష్ అన్నాడు.
బోయింగ్ 787 డ్రీమ్లైనర్లో ఉన్న 242 మందిలో 11A సీటులో కూర్చున్న బ్రిటిష్ జాతీయుడు విశ్వాష్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
AI 171లో ఉన్న 242 మందిలో 12 మంది సిబ్బంది, 230 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటనలో ధృవీకరించింది. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు.