1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (11:12 IST)

దేశంలో తొలి డెల్టా వేరియంట్ మరణం.. ఎక్కడ నమోదైంది?

దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతుంటే డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ బారినపడిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇది దేశంలో నమోదైన తొలి డెల్టా వేరియంట్ మృతి కేసు కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్‌ సోకి బుధవారం ఒక మహిళ మృతి చేందారు. 
 
మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్‌ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వల్లనే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్‌ బారిన పడినట్లు తెలిపారు. 
 
బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్‌ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. దీంతో ఆయన మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్‌ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. 
 
కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 5 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్‌ నుంచి కాగా రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్‌వేరియంట్‌ను జయించగా.. వ్యాక్సిన్‌ తీసుకొని మహిళ మృతి చెందారు. మరోవైపు మహారాష్ట్రలో 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడిన విషయం తెల్సిందే.