శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జులై 2023 (14:53 IST)

ఢిల్లీ మెట్రో రైలు: సహ ప్రయాణీకునిపై చేజేసుకున్న మహిళ

Delhi Metro
Delhi Metro
ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణీకుల ఘర్షణ, ముద్దులు, రొమాన్స్ వంటివి జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మెట్రో అడ్మినిస్ట్రేషన్ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోలో ఓ ప్రయాణీకురాలు.. తనతో పాటు ప్రయాణించిన వ్యక్తిని చెంప ఛెల్లుమనిపించింది. ఈ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ సమయంలో కంపార్ట్‌మెంటులో అందరి సమక్షంలో ఆ మహిళ సహ ప్రయాణీకునిపై చేజేసుకుంది. ఈ ఘటనను ఓ ప్రయాణీకులు వీడియో తీసి నెట్‌‍లో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
67 వేలకు పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. దీనిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.