శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:35 IST)

ఢిల్లీలో శీతాకాల సెలవులు.. పాఠశాలల మూసివేత

దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాల సెలవుల కోసం పాఠశాలలు మూసివేస్తున్నందున ఎటువంటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించబడవని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. 
 
విద్యార్థులకు బోధనా కార్యకలాపాలు నిర్వహించబడవు, విద్యాభారాన్ని తగ్గించడానికి, పాఠశాలలు ఇప్పటివరకు కవర్ చేయబడిన 2021-22 విద్యా సంవత్సరం సిలబస్‌ను సవరిస్తాయి. సర్వోదయ విద్యాలయ యాజమాన్యాలు సెలవుల విషయమై వారి తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది. 
 
ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1103కి చేరింది. దేశ రాజధానిలో COVID-19 మార్గదర్శకాలతో పాఠశాలలు తిరిగి తెరవబడ్డాయి. అయితే.. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల బలాలు, బలహీనతలను గమనించి.. శీతాకాల సెలవుల తర్వాత, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కేటాయించబడుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొంది.