గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (09:22 IST)

పొట్టే లాకర్... కడుపులో కిలోన్నర బంగారు ఆభరణాలు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలను వైద్యులు ఆపరేషన్ చేసి వెలికి తీశారు. ఇందులో 90 నాణేలు, గొలుసులు, చెవిదుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌ రాష్ట్రంలోని బీర్భుమ్ జిల్లాకు చెందిన 26 యేళ్ళ మహిళ ఆభరణాలతో పాటు 5, 10 రూపాయల నాణేలు, రిస్ట్‌బ్యాండ్‌లు, వాచీలను కూడా మింగేసింది. ఇటీవల ఆమె ఆనారోగ్యంపాలైంది. దీంతో రాంపుర్హట్ ఆస్పత్రికి తరలించగా, ఆమె పొట్టను స్కాన్ చేసిన వైద్యులు... అందులోని వస్తువులను చూసి విస్తుపోయారు. 
 
పొట్టలో కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, 90 నాణేలు, కొన్ని బంగారపు గొలుసులు, ఉంగరాలు, చెవి దుద్దులు ఇలా అనేకం ఉన్నాయి. దీనిపై ఆమె తల్లి స్పందిస్తూ, తన కుమార్తెకు మతిస్థిమితం లేదనీ, గత కొన్ని రోజులుగా ఇంట్లోని వస్తువులు మాయమవుతూ వస్తున్నాయనీ, ఇపుడు ఏం జరిగిందో తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆ మహిళకు ఆపరేషన్ చేసి బంగారు ఆభరణాలను బయటకు తీశారు.