మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 నవంబరు 2016 (13:27 IST)

మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా వీడియో తీశాడు.. జైలుపాలైన టీచర్

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారిపోయాడు. మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా మొబైల్‌లో వీడియో తీసి జైలుపాలయ్యాడు. అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. తమిళనా

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారిపోయాడు. మహిళలు స్నానం చేస్తుంటే రహస్యంగా మొబైల్‌లో వీడియో తీసి జైలుపాలయ్యాడు. అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. తమిళనాడు కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
నాగపట్టణం జిల్లా కుత్తాళానికి చెందిన బాలమురుగన్ (34) మైలాడుదురైలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. దివ్యాంగుడైన బాలమురుగన్ తమ ఇంటి ముందు ఓ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదేప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ దుకాణానికి వచ్చే సమయంలో బాలము రుగన్ అశ్లీల పదజాలంతో మాట్లాడుతుండేవాడు. 
 
ఈ నేపథ్యంలో 2015 ఏప్రిల్‌ 3వ తేదీన ఆ మహిళ తన ఇంటి వెనుకవైపున్న పాకలో స్నానం చేస్తుండగా తాటాకుల మధ్య మొబైల్‌ ఫోన్ ఉండడాన్ని గమనించి దిగ్ర్భాంతి చెందింది. దానిని తీసి తన భర్తకు చూపించి పెరంబూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలమురుగన్‌ను నిందితుడిగా తేల్చారు. ఈ కేసును విచారించిన కార్తికేయన్ బాల మురుగన్‌కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమాను విధిస్తూ తీర్పు చెప్పారు.