1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Five terrorists killed in Jammu & Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల హతం

terrorists
జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం హతమార్చింది. షోపియాన్‌ జైనాసోరా సమీపంలోని రెబాన్ ప్రాంతంలో ఉదయం నుంచి జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

గత ఐదు నెలల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. 
తర్వాతి కథనం
త్వరలో కేసీఆర్‌, జగన్‌ సమావేశం..?