శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 30 జూన్ 2019 (10:26 IST)

బడి నుంచి ఇంటికొస్తుంటే కారులో లాక్కెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్

బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ బాలిక బడి ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కారులో లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని అరెస్టు చేయగా, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని సరాన్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక స్కూలు ముగిసిన అనంతరం సైకిలుపై ఇంటికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించారు. కారులోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బసంత్ రోడ్డులో బాలికను కారు నుంచి కిందికి తోసేసి పరారయ్యారు. 
 
తీవ్ర గాయాలపాలై రోడ్డుపై పడిన బాలిక పాదచారుల మొబైల్ ఫోన్ తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గంటపాటు ఆమెను కారులో తిప్పి అత్యాచారానికి ఒడిగట్టారని సరాన్ జిల్లా ఎస్పీ హరికిశోర్ రాయ్ తెలిపారు. 
 
ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, అత్యాచారానికి పాల్పడింది మాత్రం ముగ్గురేనని వివరించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.