ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 ఆగస్టు 2021 (17:24 IST)

నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసారని బాధితురాలు వెళితే...

సికందర్ పూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో తనపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. 
 
తన ఫిర్యాదులో, రెండు నెలల క్రితం నిందితులు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అయితే అంతకు ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు తనను తిప్పి పంపేసారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
 
ఆమె పోలీసు సూపరింటెండెంట్‌ని సంప్రదించినప్పుడు మాత్రమే ఇది నమోదు చేయబడిందని ఆమె చెప్పింది. ఎఫ్ఐఆర్‌లో దీపక్ సాహ్ని, రితేష్, దినేశ్, ధీరాజ్, దుర్గేష్, శివ దయాళ్ పేర్లు వుండగా వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నాయి.
 
నిందితులపై ఐపిసి మరియు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సికిందార్‌పూర్, ఎస్‌హెచ్‌ఓ, రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని ఆయన చెప్పారు.