1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (09:52 IST)

పెళ్లి పీటలపై వధువుపై చేయి చేసుకున్న వరుడు.. మొండికేసిన కుమార్తె

marriage
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో ఘటన జరిగింది. పెళ్లి పీటలపైనే వధువుపై వరుడు చేయి చేసుకున్నాడు. దీంతో అలిగిన వధువు పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోయింది. పీకలవరకు మద్యం సేవించిన వరుడు... పెద్దల నుదుట వరుడు సింధూరం దిద్దలేకపోయాడు. పైగా, వధువుపై చేయి చేసుకున్నాడు. దీంతో అలిగిన వధువు... పెళ్లి పీటలపై నుంచి లేచి అలిగి వెళ్లిపోయింది. చివరకు ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. మీర్జాపూర్‌ జిల్లా మాణిక్‌పూర్‌లో జరిగింది. 
 
పెళ్లికి ముందు వధూవరులిద్దరూ కలిసి మండలంలో పూజలు నిర్వహించారు. అప్పటికే పీకల వరకు మద్యం సేవించి, మత్తులో ఉన్న వరుడు వధువు నుదుట సింధూరం దిద్దాల్సి ఉండగా, తడబడ్డాడు. నుదుట బొట్టు పెట్టేందుకు నానా తంటాలు పడ్డాడు. చివరికి ఆమె సింధూరం చల్లటం ప్రారంభించాడు. వధువు అతడిని ఆపే ప్రయత్నం చేయగా మైకం మత్తులో ఆగ్రహంతో ఊగిపోయిన వరుడు ఆమెపై చేయి చేసుకున్నాడు. 
 
దీంతో ఇలాంటి వాడిని తాను పెళ్లి చేసుకోబోనంటూ పీటలపై నుంచి వధువు లేచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇరు వర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. చివరకు వధువు తరపు వారు చేసిన వివాహ ఖర్చులను తిరిగి చెల్లించేందుు వరుడు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారి వెళ్లిపోయారు.