1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (09:16 IST)

జల దిగ్బంధంలో చెన్నై, నెల్లూరులో భారీ వర్షం, సాయంత్రానికి తీరం దాటనున్న వాయుగుండం

చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో వున్న వాయుగుండం గురువారం రాత్రి తమిళనాడులోని కరైకాల్-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
 
ఈ వాయుగుండం ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. చెన్నై మహానగరం సహా మరో 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. నెల్లూరులో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
 
నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.