గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: శుక్రవారం, 1 మార్చి 2019 (18:19 IST)

ఫోన్లో ఎవడితో మాట్లాడుతున్నావ్...? భార్యకు అక్కడ ఐరన్ బాక్స్ పెట్టిన భర్త...

భార్య ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చిత్రహింసలు పెట్టాడు. ఇస్త్రీ పెట్టెతో మర్మాంగాలపై కాల్చాడు. ఈ ఘటన అహ్మదాబాద్‌కి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న రాయిఖండ్ ఏరియాలోని వైశ్యసభలో 45 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. 
 
అతనికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పదేపదే ఫోన్‌లో మాట్లాడుతుండటంతో, అతనికి ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే పలుమార్లు ఏదో సర్దిచెప్పింది. ఐతే ఆమెపై నమ్మకంలేని భర్త ఆమెకు తెలియకుండా ఫోన్‌లో కాల్ రికార్డర్‌ని యాక్టివేట్ చేశాడు. అది గమనించని భార్య యాధావిధిగా ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడింది. 
 
రికార్డింగ్ కాల్ విన్న భర్తకు అసలు నిజం తెలిసిపోయింది. వివాహేతర సంబంధం పెట్టుకుందని నిర్ధారించుకున్నాడు. నిజం చెప్పమని భార్యను కొట్టడం ప్రారంభించాడు. అయితే ఆమె నోటితో వాస్తవం చెప్పలేదు. కోపోద్రిక్తుడైన భర్త ఇస్త్రీ పెట్టెతో మర్మాంగాలను కాల్చాడు. పిరుదులు, వీపుపై వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టాడు. ఆమె అక్కడ నుండి తప్పించుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. వారు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. వారి సలహా మేరకు ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.