శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (18:49 IST)

పప్పులో కాలేసిన కాంగ్రెస్.. ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేశారు..?

కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌... గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రాను ట

కాంగ్రెస్ పార్టీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌... గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రాను ట్యాగ్ చేయడంపై కాంగ్రెస్‌పై నెట్టింట్లో సెటైర్లు పేలుతున్నాయి. 
 
రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసత్యాలు పలుకుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. 'భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి' అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు. తీరా నెటిజన్లు కామెంట్లతో ఏకిపారేయడంతో హడావిడిగా ఈ ట్వీట్‌ను తొలగించారు.