పాకిస్థాన్ మెడలు వంచుదాం... ఎయిర్ లింక్ కటీఫ్ దిశగా భారత్ అడుగులు...
ముష్కర మూకలతో భారత్లో ఉగ్రదాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మెడలు వంచాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందులోభాగంగా పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి మెడలు వంచేలా ఒక్కో చర్య చేపట్టింది.
ముష్కర మూకలతో భారత్లో ఉగ్రదాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ మెడలు వంచాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. ఇందులోభాగంగా పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసి మెడలు వంచేలా ఒక్కో చర్య చేపట్టింది. సింధు నది జలాల ఒప్పందం, ఆ దేశానికి మనమిచ్చిన అత్యంత సానుకూల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాలపై సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు గగనతల సంబంధాలనూ తెంచుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఉభయ దేశాల మధ్య విమానాల రాకపోకలను నిషేధించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రధాని మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. నిజానికి భారత విమానాలేవీ పాక్కు వెళ్లడం లేదు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ) వారానికి ఐదు విమానాలు నడుపుతోంది. ఢిల్లీ-లాహోర్ మధ్య రెండు, ముంబై-కరాచీ నడుమ రెండు, ఢిల్లీ-కరాచీ మధ్య ఒక విమానం నడుస్తున్నాయి.
ఉభయ దేశాలకు చెందిన చాలా విమానాలు పరస్పర గగనతలాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. గల్ఫ్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు భారత విమానాలు పాక్ గగనతలం మీదుగానే వెళ్తున్నాయి. అలాగే ఆగ్నేయాసియా, బంగ్లాదేశ్లకు పాక్ విమానాలు భారత గగనతలంమీదుగా వెళ్తున్నాయి. ఉభయ దేశాల నడుమ పౌరవిమానయాన సంబంధాల వివరాలన్నీ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోరిందని ఆ శాఖ వర్గాలు గురువారం తెలిపాయి.