జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?
దేశంలో రైల్వే చార్జీలు చాలా సంవత్సరాల తర్వాత పెరగనున్నాయి. ఈ పెరిగిన జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్ టిక్కెట్ ధర కిలోమీటరు ఒక్క పైసా, ఏసీ తరగతి టిక్కెట్ ధర కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెరగనున్నాయి. రైల్వే వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ కథనాలు నిజమైతే దేశంలో చాలా యేళ్ళ తర్వాత రైల్వే టిక్కెట్ ధరలు సవరించనున్నాయి. సబర్బన్ టికెట్ ధరలు 500 కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ ప్రయాణినికి ఈ పెంపు వర్తించదు. 500 కిలోమీటర్లు దాటితో కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ టిక్కెట్కు సంబంధించి రైల్వే శాఖ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.
ఆధార్ అథంటికేషన్ ఉన్న వారికి తత్కాల్ టిక్కెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. జూలై ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. అదే రోజు నుంచి టిక్కెట్ ధరల పెంపు కూడా అమల్లోకి రానున్నట్టు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. నెలవారీ సీజన్ టిక్కెట్ ధరల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని సంబంధిత వర్గాలు తెలిపారు.